Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్:- ఎయిర్ పోర్ట్ లో బంగారు చీరతో పట్టుపడ్డ స్మగ్లర్లు.

DBN TELUGU:- హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో బంగారు చీరతో పట్టుబడ్డ స్మగ్లర్లు.


 వివరాల్లోకి వెళితే.... బంగారం అక్రమ రవాణా కోసం స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టుల గుండా గోల్డ్ స్మగ్లింగ్‌ కోసం సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. అయితే ఎయిర్‌పోర్టుల్లో పటిష్టమైన తనిఖీ వ్యవస్థ కారణంగా పట్టుబడుతున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఇదే తరహా ఘటన మరొకటి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం వెలుగుచూసింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 461 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. సదరు బంగారం విలువ రూ.28.01 వరకు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. కాగా.. కస్టమ్స్ అధికారులు గుర్తించకుండా నిందితుడు చీరకు బంగారం స్ప్రే కొట్టాడని తెలిపారు. చాకచక్యంగా కస్టమ్స్ అధికారులను ఏమార్చే ప్రయత్నం చేశాడని, గుర్తించడంతో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్టు కస్టమ్స్ అధికారులు వివరించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.