DBN TELUGU:- సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలం లచ్చపేటలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. కులాలు వేరుకావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిన వాళ్లు ఇంట్లో బుధవారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే...దుబ్బాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో నేహా ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అదే కాలేజీలో లచ్చపేటకు చెందిన భగీరథ్ సెకండియర్ చదువుతున్నాడు వీళ్లిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. మీరు పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ క్రమంలో బుధవారం భగీరథ్ కు చెందిన ఓ ఇంట్లో ఇద్దరూ ఒకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.