Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్:- సీఎం రేవంత్‌ రెడ్డి తో పాటు ఢిల్లీకి MLA నవీన్‌ యాదవ్.

DBN TELUGU CHANNEL:- 

• ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్‌ రెడ్డి.

ఢిల్లీకి సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టి.పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. 

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ.






- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరుతారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. అలాగే ఆయనతో పాటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా హస్తినకు వెళ్లనున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశం కానున్నారు. సీఎం పర్యటన అజెండాకు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా తెలియనప్పటికీ ఈ పర్యటన రాష్ట్ర, జాతీయ నాయకత్వం మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంతో సహా కీలకమైన పరిపాలనా, రాజకీయ అంశాలపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.