Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి.

DBN TELUGU:-  రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి చెందాడు.





జైపూర్ ఎస్ఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని గుండారానికి చెందిన యాదగిరి రమేశ్ (36) ఇందారం ఓపెన్ కాస్ట్ గనిలో సర్వే మజ్జూర్ గా పనిచేస్తున్నాడు. శనివారం డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఇందారం ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో బైక్ అదుపు తప్పి డివైడర్ ను డీట్టాడు. ఈ ప్రమాదంలో రమేశ్ తీవ్రంగా గాయపడగా రామకృషాపూర్ సింగరేణి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తుండగా ఆదివారం చనిపోయాడు. మృతుడికి భార్య స్రవంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.