DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలోనీ చెన్నూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో కోటపల్లి మండలం బోరెంపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ దుర్గం కుబేర్ (25) మృతి చెందాడు. బోరెంపల్లి నుంచి చెన్నూరు వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కుబేర్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృత దేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లకు రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసుల తెలిపారు.