Type Here to Get Search Results !

ఐఐటీలో సత్తా చాటిన బెల్లంపల్లి సిఓఈ విద్యార్థులు.

DBN TELUGU:- 


- ఐఐటిలో సీట్లు సాధించిన ఇద్దరు సిఓఈ విద్యార్ధులు.


- ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.





తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సిఓఈ), బెల్లంపల్లికి చెందిన ఇద్దరు విద్యార్ధులు తేజావత్ సిద్దు మరియు గట్టు శ్రీహర్ష లు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి సీట్లు సాధించారు.జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ నిర్వహించిన రెండవ రౌండ్ కౌన్సిలింగ్ లో ఏకంగా ఇద్దరు సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ ఐనాల సైదులు తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయస్థాయిలో జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్ రెండు దశలలో నిర్వహించిన జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపి ఈ సీట్లు సాధించారు. ఇదే కళాశాలనుండి మొదటి రౌండ్ లో దుర్గం చరణ్ తేజ్ కూడా ఐఐటి సాధించడం విశేషం. 

మంగళవారం సిఓఈ ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ సీట్లు సాధించిన విద్యార్ధులు గట్టు శ్రీహర్ష మరియు తేజావత్ సిద్దు లను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే గొప్ప కార్యాలు చేయవచ్చునన్నారు. చదువుకున్నవారికి సమాజంలో ఎనలేని విలువ ఉంటుందని విద్యార్ధులు చదువును విడిచిపెట్టకుండా ముందుకు సాగిపోవాలన్నారు. బెల్లంపల్లి సిఓఈ ఉత్తర తెలంగాణ కే తలమానికంగా విద్యార్ధుల విజయాలతో ముందుకుపోవడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో బెల్లంపల్లి సిఓఈ కి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.  


-- ఎమ్మెల్యేకు విజ్ఞాపన అందజేసిన ప్రిన్సిపాల్-- 





ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఐనాల సైదులు సిఓఈ లో భవిష్యత్ అవసరాలను డృష్టిలో ఉంచుకొని అధనపు తరగతుల నిర్మాణం చేయాలని కోరారు. అదేవిధంగా శానిటేషన్,కాంపౌండ్ వాల్ ఎత్తు,ఫెన్షింగ్ నిర్మాణం, మహిళా పేరెంట్శ్ కు టాయిలెట్ సౌకర్యంతోపాటి వెయిటింగ్ హాల్ తదితర పలు అవసరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన సుముఖంగా స్పందించి త్వరలోనే కళాశాలలో నెలకొన్న సమస్యలతోపాటు అవసరాలను ఒక్కొక్కటిగా పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.     


--సీట్లు సాధించిన విద్యార్ధుల నేపధ్యం--


ఐఐటి దంబాగ్ లో సీటు సాధించిన గట్టు శ్రీహర్ష్ 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బెల్లంపల్లి సి ఓ ఈ లో చదివాడు. జేఈఈ మైన్స్ మరియు అడ్వాన్స్డ్ లో ప్రతిభ చూపి ఐఐటి ధన్బాద్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో సీటు సాధించాడు. శ్రీహర్ష్ తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి- జ్ఞానేశ్వర్ లు అచ్చలాపూర్ గ్రామం తాండూరు మండలం లో రోజు వారీ కూలీతో పొట్ట గడవక హైదరాబాద్ కు వలస వెళ్ళారు. నిర్మాణాల వద్ద సెక్యురిటీ గార్డ్ గా పనిచేస్తూ తమ పిల్లలను చదివించుకుటున్నారు. అదేవిధంగా తేజావత్ సిద్దు 10వ తరగతి వరకు ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలో చదివి 10 జిపిఏ సాధించాడు. ఇంటర్మీడియట్ బెల్లంపల్లి సిఓఈ లో చదివి ఐఐటి ఖరగ్ పూర్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సీటు సాధించాడు. నిర్మల్ జిల్లా,ఎర్రగుంట గ్రామానికి చెందిన సిద్దు తల్లిదండ్రులు శవంత-రవిందర్ లు రెక్కడితేగాని డొక్కాడని అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి సీటు సాధించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఐతే వీరికి ఫీజులు కట్టడం తలకుమించిన భారమవుతుందని వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో జెవిపి శ్యాంసుందర్ రాజు, పేరెంట్స్ కమిటీ గౌరవాధ్యక్షులు తిరుపతి,అధ్యాపకులు నాగిని శ్రీరామ వర్మ,మిట్ట రమేష్,చందా లక్ష్మినారాయణ,ముద్దసాని శోభ,కట్ల రవిందర్,అవునూరి రవి,యండి రఫీ,సీనియర్ ఉపాధ్యాయులు వరమని ప్రమోద్ కుమార్,వామన్,అకెనేపల్లి రాజేష్,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.