DBN TELUGU:-
- కాంగ్రెస్ పార్టీకి షాక్ బీఆర్ఎస్ లోకి టిబిజికెయస్ నాయకులు.
- కాసిపేట 2 గని లో ఐఎన్టీయిసీ యూనియన్ కీ షాక్ ఇచ్చిన ఇద్దరు ముఖ్య నాయకులు.
- సోంత గూటికి చేరుకున్నా టిబిజికెయస్ మాజీ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి, కోత్తపల్లి ఉదయ్
-- కాసిపేట మండలంలోని కాసిపేట 2 గని ఐఎన్టీయిసీ యూనియన్ లో ఇటీవలే చేరిన టిబిజికెయస్ మాజీ ఫీట్ సెక్రటరీ కారుకురి తిరుపతి, మైన్ కమిటీ మెంబర్ కోత్తపల్లి ఉదయ్ తిరిగి సోంత గూటికి చేరుకున్నారు. బిఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కోప్పుల ఈశ్వర్, బెల్లంపల్లి నియోజకవర్గం బిఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టిబిజికెయస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ సమక్షంలో టిబిజికెయస్ యూనియన్ & బిఆర్ ఎస్ పార్టీ లో చేరిన టిబిజికెయస్ మాజీ ఫీట్ సెక్రటరీ కారుకురి తిరుపతి, కోత్తపల్లి ఉదయ్. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ... టిబిజికెయస్ పెద్ద నాయకులు ముకుమ్ముడీ రాజీనామాలు, కార్మికుల శ్రేయస్సు కోసం మాత్రమే మేము అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఐఎన్టీయిసీ యూనియన్ లో చేరడం జరిగింది. మళ్లీ తిరిగి టిబిజికెయస్ యూనియన్ మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ముందు కు వెళ్తుంది. టిబిజికెయస్ యూనియన్ సాధించిన హక్కులు ఏ ఇతర యూనియన్ సాధించలేదు కార్మికుల శ్రేయస్సు కోసం ఎల్లా వేళలా టిబిజికెయస్ అండగా ఉంటుంది. కార్మికుడు లేనిది కంపెనీ లేదు కార్మిక నాయకుడు అయినటువంటి కోప్పుల ఈశ్వర్ సమక్షంలో చేరడం మా అద్రృష్టంగా భావిస్తు రాబోయే ఎంపీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి కోప్పుల ఈశ్వర్ కీ కార్మికుల అందరు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ బెల్లంపల్లి నియోజకవర్గం అధికార ప్రతినిధి కోమ్మెర లక్ష్మణ్, టిబిజికెయస్ యూనియన్ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికల సంపత్, ఏరియా నాయకులు రమణా, దుగుట శ్రీనివాస్,దాసరి శ్రీనివాస్, కోట్టె రమేష్, కాసిపేట 2 గని టిబిజికెయస్ యూనియన్ నాయకులు సారంగాపణి, కాసిపేట మండల బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.