Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: ఎస్ఎస్సి ఫలితాల్లో బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధుల తిరుగులేని విజయం.

DBN TELUGU:- 



- ఎస్ఎస్సి ఫలితాల్లో బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధుల తిరుగులేని విజయం.


- 100 శాతం ఫలితాలు, పరీక్షకు హాజరైన 74 మంది ఉత్తీర్ణత.


- ఆరుగురికి 10 జిపిఏ.


- ఇద్దరికి 9.8 జిపిఏ.


- ఐదుగురికి 9.7 జిపిఏ.


- హిందీలో అత్యధికంగా 39 మందికి 10జిపిఏ.


- ఏకంగా 38 మందికి 9 ఆపై జిపిఏ.






10వ తరగతి ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ (సిఓఈ) బెల్లంపల్లి విద్యార్ధులు తిరుగులేని విజయం సాధించారు. గత ఆరు సంవత్సరాలుగా వందశాతం ఫలితాలు సాదిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. అదే క్రమంలో మంగళవారం ఎస్సెస్సీ బోర్డ్ ప్రకటించిన ఫలితాల్లో సైతం వందశాతం ఫలితాలు సాధించి తన హవా కొనసాగించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఐనాల సైదులు మాట్లాడుతూ... గురుకులం నుండి 74 మంది పరీక్షకు హాజరుకాగా 74 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. అంతేకాకుండా అదేవిధంగా 6 మంది 10 జిపిఏ సాధించగా 9 జిపిఏ ఆపై ఏకంగా 38 మంది సాధించి బెల్లంపల్లి సత్తా చాటారు.


-- 10జిపిఏ సాధించిన విద్యార్ధుల వివరాలు-- 


అల్తాటి వినయ్, బొల్లం ఆభినయ్ తేజ్, జాడి జశ్వంత్, చిగిరి వినిల్ కుమార్, జంగంపెల్లి ప్రణయ్ చరణ్, భూక్య శశివర్దన్. వీరితోపాటు కొనురి సిద్దార్థ, పల్సి విష్ణు, రాంటెంకి గిరిదర్, గోమాస ఆభిసేక్ లు9.8 జిపిఏ సాధించారు. మరో ఐదుగురు విద్యార్ధులు 9.7 జిపిఏ సాధించడమేకాక ఎడుగురు విద్యార్ధులు 9.5 జిపిఏ 16 మంది విద్యార్ధులు 9జిపిఏ ఆపైన సాధించడం విశేషం.  


గత ఆరు సంవత్సరాలుగా వరసగా 100శాతం ఫలితాలతో అప్రతిహాతంగా కొనసాగుతున్న సిఓఈ మరోసారి వందశాతం ఫలితాలతో తిరుగులేని విజయాలు తమ విద్యార్ధులు సాధించడం పట్ల ప్రిన్సిపాల్ ఐనాల సైదులు సంతోషం వ్యక్తం చేశారు.అద్బుతమైన విజయాలతో గురుకులాల్లోనే ఆదర్శవంతంగా నిలవడం పట్ల ఆదిలాబాద్ సక్షేమ గురుకులాల ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా 10 జిపిఏ సాధించిన అల్తాటి వినయ్, బొల్లం ఆభినయ్ తెజ్, జాడి జశ్వంత్, చిగిరి వినిల్ కుమార్, జంగంపెల్లి ప్రణయ్ చరణ్, భుక్య శశివర్దన్ ను ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ తో కలిసి మిఠాయిలు పంచుకొని ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కోట రాజ్ కుమార్, సీనియర్ ఉపాధ్యాయులు వరమని ప్రమోద్ కుమార్, భోగ అశోక్, పిన్నింటి కిరణ్ ,ఆకెనేపల్లి రాజేష్, కామెర ప్రేమలత, సజ్జనపు విజయ్ కుమార్, భోగే శ్రీలత, తేజశ్వి, ఐ.మల్లేష్, సమందర్ అనుముల అనిరుద్, యండి రఫి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ యండి కౌసర్ తల్లిదండ్రులు సరోజ- పవన్ కుమార్, రజిత-రమేష్ లు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.