DBN TELUGU:-
- సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా సాయి భోజన్.
- గర్భిణులకు బాలింతలకు రోగులకు అన్నదానం.
- ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమం.
- బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ.
-- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుల సహకారంతో గర్భిణులకు బాలింతలకు, రోగులకు, అన్నార్తులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్తులు, ఆసుపత్రి సిబ్బంది, సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.... నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను గుర్తు చేసుకుంటూ ఆయన పేరిట అన్నదానం చేయడం ఆనందంగా ఉందని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి అన్నారు. దేశం కోసం పోరుబాట పట్టి బ్రిటిష్ వారిని గడగడాలాడించిన నేతాజీ ఈ భారత దేశ భూ మండలం ఉన్నంతవరకు గుర్తుంటారని పేర్కొన్నారు.
-- అన్నదానం చేద్దాం రండి --
ట్రస్ట్ ద్వారా "ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం" అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు దుర్గం మారుతి సేవకులు ఈగురపు భాస్కర్, డి మధుకర్, వేల్పుల రాజేందర్, అంకతి తిరుపతి, మారుముఖం సురేష్ , డాక్టర్లు డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు, తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.