DBN TELUGU:- తెలంగాణలో ఎన్నికల పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు చేరుకున్నారు.
బుధవారం సాయంత్రం వచ్చిన రాహుల్ తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ములుగు జిల్లాలో కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రను ప్రారంభించారు. ఇక ఇవాళ ఈ యాత్ర పెద్దపల్లి జిల్లాలో కొనసాగనుంది. బుధవారం ములుగు జిల్లాల ప్రారంభమైన రాహుల్ గాంధీ యాత్ర రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పూర్తి చేసుకుంది. ఈ రోజు ఉదయం మంథని నియోజకవర్గం కేంద్రంతో పాటు కమాన్పూర్ మండలాల్లో బస్సు యాత్ర జరగనుంది. అలాగే మధ్యాహ్నం రామగిరి మండలానికి బస్సు యాత్ర చేరుకుంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. తర్వాత అక్కడి సింగరేణి కార్మికులు, రైతులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడతారని వెల్లడించాయి. సాయంత్రం నాలుగు గంటలకు పెద్దపల్లి నియోజకవర్గం కేంద్రంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ నేతలు ముస్తాబు చేస్తున్నారు.