DBN TELUGU:-
- బాయిజమ్మ గణేష్ మండలి వద్ద ఘనంగా అన్నదానం.
- నవరాత్రుల సందర్భంగా కార్యక్రమం.
- బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ.
- హాజరైన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
-- బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండలి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఘనంగా అన్నదానం నిర్వహించారు. ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద నవరాత్రుల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం బస్తీ మరియు పట్టణ ప్రముఖులకు అన్నదానం చేపట్టారు. బాయిజమ్మ సాయిసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా అన్నదానం చేయడం మంచి కార్యక్రమాన్ని పేర్కొన్నారు. గణపతి ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత -శ్రీధర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బిఆర్ఎస్ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
-ఆదరిద్దాం... అన్నదానం చేద్దాం-
ట్రస్ట్ ద్వారా "ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం" అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సేవకులు ఈగురపు భాస్కర్, సాగాల సదానందం చక్రపాణి నాయకులు కాంపల్లి రాజం, మీడియా సిబ్బంది, దాతలు, తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.