DBN TELUGU:- బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలోని 15 మంది లబ్ధిదారులకు 9,75,000 ( తొమ్మిది లక్షల డెభై ఐదు వేల) రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోకి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నిరుపేద కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. అలాగే రానున్న ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ప్రజలకు మరిన్ని అభివృద్ధి పథకాలు తెచ్చే విధంగా సహాయపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, బెల్లంపల్లి ఎంపీపీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, ఎంపీటీసీ శకుంతల, మండల BRS పార్టీ అధ్యక్షులు గణేష్ గౌడ్, ఏస్.సి సెల్ ప్రెసిడెంట్ దామెర కిరణ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, లబ్ధిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.