Type Here to Get Search Results !

మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా సాయి భోజన్.

DBN TELUGU:- 

- మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా సాయి భోజన్.

- బెల్లంపల్లి పట్టణంలోని పలు చోట్ల ఆహారం పంపిణీ.

- బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ.



బెల్లంపల్లి పట్టణంలో మహ్మద్ ప్రవక్త జయంతి మిలాద్ ఉన్ నబీ సందర్భంగా గురువారం బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదానం నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా రైల్వే స్టేషన్ ఏరియా పాలిటిక్స్ తదితర ప్రాంతాల్లో మానసిక వికలాంగులకు, పేదవాళ్లకు, అన్నార్తులకు సాయి భోజన్ ఆహారం పంపిణీ చేసినట్లు సనాతనధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ -రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటుతూ ముస్లింల ఆరాధ్యుడు మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా అన్నదానం చేయడం ఆనందంగా ఉందని భాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పేర్కొన్నారు. 


-- ఆదరిద్దాం.. అన్నదానం చేద్దాం.


బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా "ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం" అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ గార్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమములో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సేవకులు, దాతలు ,తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం, సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.