DBN TELUGU:- లోన్ నిర్వాహకుల వేధింపులకు సింగరేణి కార్మికుడు మృతి చెందిన సంఘటన పెద్దపెల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఆన్ లైన్ లోన్ నిర్వాహకుల వేధింపుల వల్ల ఓదెల మండలంలోని కొలనూరు గ్రామానికి చెందిన వంశీకృష్ణ సింగరేణిలో ఉద్యోగం చేస్తూ పెద్దపల్లిలో నివాసం ఉంటున్నాడు. అయితే ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఆన్ లైన్ లో రుణం తీసుకొని ఇప్పటికే రెండున్నర లక్షలు చెల్లించినా, లోన్ నిర్వాహకుల వేధింపులకు తాళలేక గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా వారిిి బంధువులు మాట్లాడుతూ... లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల వల్లే వంశీకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. అలాగే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పెద్దపెల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని తెలిపారు.