Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: విద్యుత్ షాక్ తో... తండ్రి కొడుకులు మృతి...!

DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలో విద్యుత్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
 

వివరాల్లోకి వెళితే... మంచిర్యాల పట్టణంలోని ఎంసీసీ కాలనీలో నివాసం ఉండే ఎడ్ల రాజేందర్ మరియు అతని కుమారుడు అరుణ్ కుమార్ ఇద్దరు ఒకేసారి మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజేందర్ స్నానం చేసి టవాల్ ను దండంపై ఆరవేస్తుండగా విద్యుత్ వైరు తాకడంతో షాక్ కు గురయ్యాడు. దీనిని గమనించిన కుమారుడు తండ్రిని కాపాడుదామని తొందరలో ఇతను కూడా విద్యుత్ షాక్ కు గురికావడంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు.

 విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అనంతరం పోస్టుమార్టం  నిమిత్తం మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.