Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: బిజెపిలోకి చికోటి ప్రవీణ్ కుమార్...?

DBN TELUGU:- గత కొన్ని రోజులు కిందట సంచలనంగా పేరు మారుమోగిన చికోటి ప్రవీణ్ కుమార్‌‌ కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు.



మంగళవారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. నగరానికి చెందిన ప్రవీణ్ కుమార్ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టి క్రమంగా ఎదిగారు. గతంలో నుంచే హిందుత్వ ఎజెండాతో ఆయన పనిచేస్తున్నారు. పార్టీలో లేకపోయినా బీజేపీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకున్నారు. స్వయంగా ఆయన ధర్మ రక్ష పేరిట ఒక హిందూ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. 10 లక్షల మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు దిశగా చికోటి అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ముగింపు వరకు ఈ లక్ష్యాన్ని అధిగమిస్తానని ఆయన చెబుతున్నారు. బీజేపీలో చేరేందుకు చికోటి ప్రవీణ్ భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగరంలో భారీ ర్యాలీకి ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ నుంచి అవకాశం ఇస్తే ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు సుముఖత చూపుతున్నారు. అదే పార్లమెంట్ స్థానం నుంచి అయితే జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. తను నివసించేది ఎల్బీనగర్ సెగ్మెంట్ పరిధిలోనే కావడంతో స్థానికంగా పట్టు ఉందని ఆయన అనుకుంటున్నారు. అలాగే హిందుత్వ, తన సామాజిక వర్గం సపోర్ట్ ఉంటుందని చికోటి భావిస్తున్నారు. జహీరాబాద్ నుంచి ఎంపీగా బరిలోకి దిగేందుకు హిందువుల ఓట్లు కలిసొస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఏరియాలో హిందువుల ఓట్లు భారీగా ఉండటంతో నే ఆయన ఈ ప్లేస్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.