Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ హామీల గురించి ప్రజలకు వివరిస్తున్న దుర్గం భాస్కర్.

DBN TELUGU:- TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం భాస్కర్ చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మహిళలకు, వృద్ధులకు, యువకులకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ హామీల కార్డును పంచుతూ వివరించడం జరిగింది.






ఈ సందర్భంగా మాట్లాడుతూ...  తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆగమైందని యువకులకు కొలువులు రాలేదు కానీ కెసిఆర్ కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయని, రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఈ దుర్మార్గపు పాలన అంతం కావాలంటే, రాష్ట్రం సంక్షేమ రాష్ట్రం కావాలంటే కెసిఆర్, BRS పాలన పోవాలి. కాంగ్రెస్ రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో INTUC కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు కలవెన శ్యామ్, విద్యార్థి సంఘాల JAC చైర్మన్ చిప్పకుర్తి శ్రీనివాస్, తెలంగాణ నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అనపర్తి యువరాజ్, ఓయూ జేఏసీ నాయకులు దుర్గం మల్లేష్, మంచినీళ్ళ రాజేష్, చెన్నూరు మండల నాయకులు పాగిరి తిరుపతి, జనగామ లచ్చయ్య, జనగామ రాజాబాబు, మేకల మల్లయ్య, జాడి రమేష్, బొరేం ఈసక్క, రజిత, సారక్క, బాలపోశు తదితరులు పాల్గొన్నారు.







Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.