Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: ఓసీపీలో ఉరేసుకొని కాంట్రాక్టు కార్మికుడు ఆత్మహత్య.

DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో  విధుల నుండి తొలగించడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.





వివరాల్లోకి వెళితే... వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెనుబాడు గ్రామానికి చెందిన దొంతగాని వీరస్వామి (50) గత 20 సంవత్సరాలుగా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో షావల్ ఆపరేటర్ గా పలు ప్రైవేట్ కంపెనీలలో విధులు నిర్వహించాడు. గత పది నెలలుగా సీఆర్ఆర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం వీరస్వామిని సీఆర్ఆర్ కంపెనీ విధుల నుండి తొలగించడంతో తీవ్ర మనస్థాపానికి గురై శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చెట్టుకు బ్లాస్టింగ్ వైరుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.