DBN TELUGU:- నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే... ఇనుపాములగుట్ట వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రక్కకు ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.