Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్:- రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం...!

DBN TELUGU:- రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని అల్లిరాజపేట సమీపంలో చోటుచేసుకుంది. 


స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవపూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి (వీరముష్టి) వెంకటేశం కుమారుడు అఖిల్ (14) అల్లిరాజపేటలోని సెయింట్ విన్సెంట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం ఇంటి నుండి పాఠశాలకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. 

గజ్వేల్ వైపు నుండి ఎదురుగా వస్తున్న లారీ పాఠశాలకు వెళ్తున్న అఖిల్ ద్విచక్ర వాహనంను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.