Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: కాలేజీ భవనం నుంచి దూకి ఆత్మహత్యాయత్నం.

DBN TELUGU:- నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ‌లో ఉన్న గంధవారి గూడెం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్లు తెలిసింది.


 ప్రమాదంలో అమ్మాయికి కాళ్లు, పళ్ళు విరగడంతో పాటు తీవ్రంగా గాయాలు అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బయటకు తెలియకుండా పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది దాచిపెడుతున్నట్లు సమాచారం. కాగా.... విద్యార్థిని భవనంపై నుండి దూకడానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. అయితే, గురుకుల కాలేజీలో సరైన సౌకర్యాలు లేవని.. భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇదేమిటని టీచర్లను ప్రశ్నిస్తే విద్యార్థులను వేధింపులకు గురిచేస్తారంటూ అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కాలేజీలోకి వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలించడానికి వెళ్తే వాళ్లను కూడా లోనికి రాకుండా అడ్డుకుంటారని పిల్లలు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.