DBN TELUGU:- స్కూల్ బస్సు కింద మూడేళ్ల బాలుడు పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... హన్మకొండ జిల్లా లోని భీమదేవరపల్లి మండలంలోని చంటయిపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. తన అన్నను స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చిన మూడేళ్ల బాలుడు మృత్యుఒడిలోకి చేరాడు.
అన్నను స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చిన బాలుడు.. బస్సు వెనుక టైర్ల కింద పడి మృతిచెందాడు. అప్పటి వరకు ఆడుతూ, గంతులేసిన కొడుకు ఒక్కసారిగా విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.