DBN TELUGU:- నిజామాబాద్ జిల్లాలో అక్క చెల్లెలను కొట్టిచంపిన సంఘటన కలకలం రేపుతుంది.
వివరాల్లోకి వెళితే... బుధవారం ఉదయం ఆర్మూర్లో ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కొట్టి హత్య చేశారు. వారి వివరాలు చూసుకుంటే మగ్గిడి గంగవ్వ, (69) మగ్గిడి రాజవ్వ( 72) గా గుర్తించారు. చంపిన తర్వాత ఇద్దరి మృతదేహాలను దహనం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భారీగా పొగలు రావడంతో గుర్తించిన స్థానికులు అక్కడి చేరుకొనే సరికి దుండగులు పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.