DBN TELUGU:- బోధన్ బైపాస్ రోడ్డులో బుధవారం ఉదయం కారు బోల్తా పడి ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.... మృతి చెందిన వ్యక్తి బోధన్ పట్టణానికి చెందిన సురేష్ దాల్మియా గా గుర్తించారు. చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని నిజమాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదమునకు గల కారణాలు పరిశీలిస్తే అధిక వేగమేనని సూచించిన స్థానికులు చెప్తున్నారు.