DBN TELUGU:-
- ఎంసెట్ లో
సి ఓ ఈ విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు.- 62 మందికి గాను 60మంది క్వాలిఫై.
- అభినందించిన ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి.
రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ (సిఓఈ) విద్యార్థులు ఉత్తమంగా రాణించారు. బైపీసీ విభాగంలో 24 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుగా 23 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో జుమిడి ప్రణయ్ 4885 (నాలుగు వేల ఎనిమిది వందల ఎనబై ఐదు ) ర్యాంకుతో టాపర్ గా నిలవగా యమ్ శివకృష్ణ 7123 , యార్కర్ నికిత్ 17928, గోమాస అఖిల్ 18578 ఆతరువాత స్థానాల్లో నిలిచినట్లు ప్రిన్సిపల్ ఐనాల సైదులు తెలిపారు. అదేవిధంగా ఎంపీసీ విభాగంలో 38 మంది పరీక్షకు హాజరు కాగా 37 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో వెలుతురు అఖిల్ 17133 ర్యాంకుతో కళాశాల టాపర్ గా నిలిచినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి ఫోన్ చేసి అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపల్ ఐనాల సైదులు తోపాటుగా అధ్యాపకులు పిన్నింటి కిరణ్ , శ్రీరామ వర్మ, మిట్ట రమేష్, చంద లక్ష్మీనారాయణ, శోభ, కట్ల రవీందర్, అనుముల అనిరుద్, ఆకినేపల్లి రాజేష్, సుంకరి అర్జున్, ఎండి లతీఫ్, సిబ్బంది సమందర్, తేజస్వి అభినందనలు తెలిపారు.