Type Here to Get Search Results !

పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి: వేముల కృష్ణ.

DBN TELUGU:- 


- పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి.


- మంచిర్యాల అసెంబ్లీ కోఆర్డినేటర్ వేముల కృష్ణ.



తనపై నమ్మకంతో మంచిర్యాల అసెంబ్లీ కోఆర్డినేటర్ గా నియామకానికి కృషి చేసిన డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని మంచిర్యాల నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేముల కృష్ణ అన్నారు. కాసిపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణ నూతనంగా మంచిర్యాల నియోజకవర్గం కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. దేశంలో మత రాజకీయాలకు చర్మ గీతం పాడాలని, ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని సందర్భంగా కోరారు. తనపై నమ్మకంతో కోఆర్డినేటర్ గా నియమించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.