DBN TELUGU:- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్కు కండకావరమెక్కి తన గురించి మాట్లాడుతున్నాడంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు.
కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్ తనపై చేసిన కామెంట్స్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎంపీగా బండి సంజయ్ చేసిందేమీ లేదంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్కు తీవ్రంగా స్పందించిన ఆయన.. పార్లమెంట్ రికార్డులు చూసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. తానేం చేశానో పార్లమెంట్ రికార్డులు చెబుతాయన్నారు బండి సంజయ్. పార్లమెంట్కు వెళ్లకుండా తాగి పడుకున్న చరిత్ర కేసీఆర్ది అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చీపురుతో బీఆర్ఎస్ను ఊడ్చేసినా సిగ్గురాదేంటూ వ్యాఖ్యానించారు. ఏం సాధించారని కరీంనగర్ కదనభేరి నిర్వహిస్తున్నారంటూ కేటీఆర్ను ప్రశ్నించారు బండి సంజయ్ కుమార్. కరీంనగర్ సభ సాక్షిగా కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను బరాబర్ హిందుత్వం గురించి మాట్లాడుతానని, దమ్ముంటే మీరు బాబర్, ఔరంగజేబు గురించి మాట్లాడాలని బీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ సవాల్ విసిరారు.