Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: ఎమ్మెల్సీకి మళ్ళీ ఈడి నోటీసులు.

DBN TELUGU:- 


- ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు.


- 26వ తారీఖున విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులో పేర్కొంది.





దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే కవితను ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈడీ తనను విచారించడపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 


                          ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ పూర్తి అయ్యే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరుకావాలంటూ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఢిల్లి లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నోటీసులు రావడంతో పొలిటికల్ హీట్ ను పెంచుతుంది. ఈ సందర్భంగా సీబీఐ విచారణకు కవిత హాజరు అవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.