Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో అన్ని స్థానాలలో పోటీ చేస్తాం: కేఏ పాల్.

DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రం

లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా ప్రజాశాంతి పార్టీ  అధ్యక్షులు కేఏ పాల్ అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని వ్యాఖ్యానించారు.





సోమవారం నాడు విశాఖపట్నంలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిందని తెలంగాణ ఎన్నికలో మా పార్టీ నుంచి 119 మంది అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. అలాగే కులమతాలకు అతీతంగా ఎన్నికల్లో గెలిచి అభివృద్ధి చేస్తాను. నేను దేశం, మన తెలుగు రాష్ట్రాలను కాపాడుకుంటున్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రూపాల స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటు పరం చేయకుండా ఆపేశారు. ఏపీలో బీజేపీ పార్టీ లేదు. ఇజ్రాయెల్, పాలస్తీనల గొడవలు ఆగిపోవలని దేవుడికి ప్రార్థన చేశా. శాంతి కోసం మీరందరు కూడా ప్రార్థన చేయాలి. డిసెంబర్10 తేదీన ప్రపంచ గ్లోబల్ క్రిస్మస్ వేడుకలు చేసుకుంటామని, గ్లోబల్ క్రిస్మస్ వేడుకలకు 5 వేల మందిని ఆహ్వానిస్తున్నామని డిసెంబర్ 10వ తేదీన ఇక్కడ నుంచే 200 దేశాలకి శాంతి సందేశం ఇస్తాను అని కేఏ పాల్ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.