Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: రేపే పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు...!

DBN TELUGU:- మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం పార్లమెంటు ముందుకు రానుంది. బిల్లు ఆమోదం పొందే సమయానికి భారీగా వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు.





ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు చెప్పేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించారు. ఢిల్లీ సమీప ప్రాంతాల నుంచి భారీగా మహిళల సమీకరణకు నిర్ణయించారు. బీజేపీ బుధవారం లేదా ఒక రోజు తర్వాత ఢిల్లీలో లేదా ఢిల్లీకి ఆనుకుని ఉన్న రాజస్థాన్‌లోని ఏదైనా నగరంలో భారీ మహిళా సదస్సు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఆ సదస్సులో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని ప్రసంగించనున్నట్టు సమాచారం. కాగా దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపు బుధవారం కొత్త పార్లమెంట్ భవనంలో ఈ బిల్లునను ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి వీలవుతుంది. దీంతో పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న మరికొన్ని బిల్లులకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.