DBN TELUGU:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో కన్న కూతురిని చంపి... తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఎన్టీఆర్ జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలోని ప్రసాదంపాడు దళితవాడ లో కూతురిని చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. కొంతకాలంగా కూతురి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో మనోవేదనకు గురైన తల్లి మూడు సంవత్సరాల మేరీ జేసీ ని చంపి తల్లి తగరం జ్యోతి రాణి కూడా కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తల్లి, కూతురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.