DBN TELUGU:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ లక్ష్మీ పథకం అర్హులైన నిరుపేద కుటుంబాలకు అందే విధంగా ఇవ్వాలని బుధవారం రోజున నిన్నెల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోకు నెన్నేల మండలానికి చెందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘం నాయకులు శంకర్ వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... కొంతమంది రాజకీయ నాయకులు బహిరంగంగానే 20వేల నుండి 30 వేల వరకు ఇచ్చిన వారికే గృహలక్ష్మి పథకం ఇస్తామనడం మండలంలో చర్చనీయంగా మారింది. ఈ యొక్క పథకానికి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా నిరుపేద కుటుంబాలకు అందే విధంగా మంజూరు చేయాలని కోరడం జరిగింది. ఒకవేళ నిరుపేద కుటుంబాలకు కాదని, ఇతరులకు ఇచ్చినచో మండల వ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.