Type Here to Get Search Results !

5 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.

DBN TELUGU:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలకేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయం వద్ద 5 లక్షల రూపాయల CDP నిధులతో నూతనంగా నిర్మించిననున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ముఖ్యఅతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.


 ఈ సందర్భంగా మాట్లాడుతూ... బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిన్న మండలమును ఎంతో అభివృద్ధి చేశామని... రానున్న ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే... ముందు ముందు మండలాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకుపోతామని తెలిపారు. 



ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్యామల, ఎంపీపీ రమాదేవి, ఎంపీటీసీ తిరుపతి, కో ఆప్షన్ ఇబ్రహీం, సర్పంచ్ లు శంకర్, బోయిని మల్లేష్, శేశి కళ, తిరుపతి రెడ్డి, సత్యనారాయణ, ఎనుక మల్లేష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అశోక్ గౌడ్, PACS చైర్మన్ మేకల మల్లేష్, నాయకులు రామ్ చందర్, ప్రతాప్, మొండి, ప్రేమ్ సాగర్, నారాయణ, వెంకటేష్ గౌడ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.