Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: 24 గంటలు కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయను: కోమటిరెడ్డి.

DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.





శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తే తాను ఎంఎల్‌ఎగా పోటీ చేయనని సవాల్ విసిరారు. అలాగే విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని, పరీక్షల నిర్వహణలో టిఎస్‌పిఎస్‌సి పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగుల జీతాలు 15వ తారీకున ఇస్తున్నారని, ఝార్ఖండ్‌లో కూడా ఒకటో తేదీన జీతాలు పడుతున్నాయని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తనతో వస్తే కర్నాటక రాష్ట్రంలో అమలవుతన్న పథకాలు చూపిస్తానని బీఆర్‌ఎస్ మంత్రులు వస్తే స్పెషల్ ఫ్లైట్ పెడతానని వివరించారు. ఎపి, కర్నాటకలో బీఆర్‌ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.