DBN TELUGU:- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామంలోని రంగ చెరువును గోవర్ధన్ గౌడ్ అనే వ్యక్తి కబ్జా చేసిన విషయంలో గురువారం గ్రామంలోని గ్రామస్థులు అందరూ కలిసి వెళ్లి ఎప్పటిలాగే ఉన్న చెరువును అలాగే పునరుద్దించాలని డిమాండ్ చేశారు.
చేరువును పునరుద్దించని పక్షంలో చెరువును అనుకోని ఉన్న ఎంతో మంది రైతుల భూములు నష్టపోతాయని అన్నారు. ఎంతో మంది ఉన్నత అధికారులకు వినతి పత్రాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నాలు చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. చెరువును కబ్జా చేసి చెరువును ఆక్రమించిన గోవర్ధన్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. ఎప్పటిలాగే చెరువును పునరుద్దించాలని లేని పక్షంలో ఊరి చెరువు విషయంలో ఎంతవరకైనా పోరాటం చేస్తామని గ్రామస్థులు అన్నారు. అలాగే చెరువు పునర్నిర్మాణం జరిగే అక్కడ ఎలాంటి పనులు జరపకూడదని అన్నారు. కానీ స్థానికంగా ఉన్న ఎల్లారెడ్డి పేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి చెరువు దగ్గర విద్యుత్ లైన్ పనులు జరిపి తీరుతామని ఈ విషయంలో అడ్డువస్తే గ్రామస్థుల అందరి మీద కేసులు పెడతానని బెదిరింపులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా మండల బీజేపీ ఉపాధ్యక్షులు సింగరవేని కృష్ణహరి మాట్లాడుతూ.... చెరువు విషయంలో ఎంత దూరమైన వెళ్తామని, కేసులు తమకేం కొత్త కాదని ఎన్నో కేసులు అక్రమంగా పెట్టిన చెరువును దక్కించుకుంటమని అన్నారు. చెరువు పునరుద్దించాలని తాము మాట్లాడితే కేసులు పెడతాం అని బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు న్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, గ్రామస్థులు రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి, కొండం శ్రీను, పందిర్ల శ్రీనివాస్, చందు యాదవ్, సొనవేని రాజయ్య, బిపేట మల్లయ్య, క్యాడం శ్రీనివాస్, పందిర్ల శ్రీనివాస్ రెడ్డి, నారాయణరెడ్డి, నాగేల్లి శ్రీనివాసరెడ్డి, రేండ్ల భూమయ్య, గొడుగు సతీష్, బొడ్డు సురేష్, అభిషేక్ యాదవ్, తదితరులు స్వామి పాల్గొన్నారు.