DBN TELUGU:- కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ బస్ స్టేషన్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మరణించగా... ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.... తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అట్ల పోచమల్లయ్య యాదవ్ (45) తిమ్మాపూర్ స్టేజి వద్ద రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చిన కారు పోచమల్లయ్య ను ఢీకొని పక్కనే ఉన్న స్తంభానికి ఢీ కొట్టి బోల్తా పడింది. కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మల్లయ్య మృతి చెందాడు. కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎల్ ఎం డి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.