Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: కొడుకును కిరాతకంగా హత్య చేసిన కన్న తండ్రి.

DNB TELUGU:- కడప జిల్లాలో కన్న కొడుకుని కన్న తండ్రి కిరాతకంగా హత్య చేసిన సంఘటన బుధవారం ఉదయం తెల్లవారుజామున చోటుచేసుకుంది. 



వివరాల్లోకి వెళితే... కమలాపురం మండలంలోని ఆగస్త లింగాయపల్లిలో తెల్లవారుజామున నిద్రిస్తున్న కన్నకొడుకు సోమేశ్వర్ రెడ్డి (12) ని కన్నతండ్రి శంకర్ రెడ్డి గొంతుకోసి హత్య చేశాడు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న సోమేశ్వర్ రెడ్డిని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే నిందితుడు శంకర్ రెడ్డి ఇటీవల మానసికంగా బాగలేడని, మతి స్థిమితం కోల్పోయాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.