Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే ఉంటా: ఎమ్మేల్యే.

DBN TELUGU:- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ చివరి నిమిషంలో అనూహ్యంగా బోథ్ టికెట్ ను అనిల్ జాదవ్ కు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో చివరి వరకూ ఎదురుచూసినా బాపురావు కు నిరాశే మిగిలింది.

 ఈ నేపథ్యంలో బాపురావు పార్టీ మారే అవకాశం ఉందని విస్తృతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన తాజాగా.. పార్టీ మార్పు వార్తలపై ఎమ్మెల్యే బాపురావు స్పందించారు. “నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతానని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. చివరి వరకు బీఆర్ఎస్లోనే ఉంటా.. కేసీఆర్ వెంటే నడుస్తా. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా బోథ్ నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్ జెండానే ఎగరబోతుందని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం హైట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.