DBN TELUGU:- తిరుపతి రైల్వే స్టేషన్లో దొంగతనాలకు పాల్పడుతున్న తమిళనాడు రాష్ట్రం తూతుకుడై చెందిన లేడీ కిలాడీలను తిరుపతి ఆర్పిఎఫ్ ప్రభుత్వ రైల్వే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి రైల్వే స్టేషన్ లో గత కొద్దికాలంలో మొబైల్ ఫోన్లు నగదు పోగొట్టుకున్న ప్రయాణికులు రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందడంతో ఆర్పీఎఫ్ ప్రభుత్వ రైల్వే పోలీసులు పట్టిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. అనుమానాస్పద రీతిలో తిరుపతి రైల్వే స్టేషన్లో తిరుగుతున్న తమిళనాడు రాష్ట్రం తూతుకుడైకు చెందిన మీనా (23) రాణి (29) అంజలి (25) నిందితుల అరెస్టు చేసి విచారించగా తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల నుంచి 76,500 విలువ గల సొత్తును అపహరించినట్లు నిందితులు అంగీకరించారు. వీరి వద్ద నుండి ఒక సాంసంగ్ గాలక్సీ జే 7, అల్ట్రా ప్రో మాక్స్ మొబైల్ ఫోన్, వివో వై 73, 34,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 71500 విలువ గల సొత్తును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను ఐదు కేసులలో నేరస్థులుగా గుర్తించి అరెస్టు చేసామని రైల్వే పోలీస్ అధికారులు పేర్కొన్నారు. మహిళ దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన తిరుపతి ఆర్ పి ఎఫ్ సిఐ మధుసుధన్, తిరుపతి జిఆర్పి సీఐ హేమ సుందర్ రావు, జి ఆర్ పి ఎస్ఐ ధర్మేంద్ర, ఆర్ పి ఎఫ్ ఎస్ఐ రాంబాబు, జి ఆర్ పి ఏఎస్ఐ రమణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీను, పోలీస్ కానిస్టేబుల్ హరి, ఆర్ పి ఎఫ్ స్టాఫ్ ఎన్ సుబ్రహ్మణ్యం, అంకబాబు, అశ్వితి చంద్రన్, సబిత, శివరంజని లను గుంతకల్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ మురళీకృష్ణ, తిరుపతి డిఎస్ఆర్బి షేక్ షాను అభినందించారు.