Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్:- బీర్ బాటిల్స్‌ కోసం దారుణ హత్య...!

DBN TELUGU:- హైదరాబాద్‌ శివారు మీర్‌పేట పరిధిలో బీర్ బాటిల్స్‌ కోసం ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుని.. అతన్ని కత్తితో కిరాతకంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది.



వివరాల్లోకి వెళితే...  జిల్లెలగూడ నుంచి సాయి వరప్రసాద్‌ అనే యువకుడు బీరు బాటిల్స్‌ కొనుక్కుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు యువకులు.. అతన్ని అడ్డుకుని బాటిల్స్‌ తమకు ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. అందుకు అతను ససేమీరా అనడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కత్తితో సాయిపై ఆ యువకులు దాడి చేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే సాయి కుప్ప కూలిపోయి మృతి చెందాడు. బీర్‌ బాటిల్‌ హత్య ఉదంతంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మీర్ పేట్ పోలీసులు తెలిపారు. అలాగే పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్, సంతోష్ యాదవ్, పవన్‌లను నిందితులుగా నిర్ధారించారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.