DBN TELUGU:- క్రికెట్ బెట్టింగ్ కు బానిసై ప్రాణాలు తీసుకున్న సంఘటన చోటు చేసుకుంది.
డబ్బులు పెట్టి నష్టపోయిన ఓ యువకుడు అప్పుల బాధతో రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గద్వాల జిల్లా రాజోలి మండలంలోని ముండ్లదిన్నె గ్రామానికి చెందిన గుండ్రతీ శ్యామసుందర్ గౌడ్ (23) క్రికెట్ బెట్టింగ్ కు అలవాటుపడి రూ.3లక్షలు పోగుట్టుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక రైలు కిందపడి సుసైడ్ చేసుకున్నాడు. కుటుంబం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీద పడాల్సి వచ్చింది. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.