Type Here to Get Search Results !

కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం.. హాజరవుతారా..లేదా...?

DBN TELUGU:- భారతదేశ ప్రధానమంత్రి ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అనంతరం వరంగల్‌లో బీజేపీ నిర్వహించనున్న సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇక వరంగల్‌లో నిర్వహించనున్న మోదీ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం పంపింది. మరి ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా...లేదా...? అనే దానిపై తెలంగాణలో పెద్ద ఎత్తున ఆసక్తికర చర్చ నడుస్తోంది. 




చాలా కాలంగా ప్రధాని మోదీ తెలంగాణ నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. కనీసం ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలికిన దాఖలాలు కూడా లేవు. జాతీయ పార్టీ ప్రారంభానికి ముందు నుంచే కేసీఆర్ ప్రధాని కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా బీజేపీపై కేసీఆర్ తన వైఖరి మార్చుకున్నట్టు తెలుస్తోంది, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టుగా ఇటీవలి కాలంలో తన ప్రధాన ప్రత్యర్థి స్థానం నుంచి బీజేపీని ఆయన తప్పించారో లేదంటే.. మోదీ విషయంలో తన వైఖరే మారిపోయిందో కానీ ఇటీవల అయితే బీజేపీ లేదంటే మోదీ విషయంలో పెద్దగా కేసీఆర్ బాణాలు ఎక్కుపెట్టడం లేదు. పరిస్థితులకు అనుకూలంగా ఆయన కూడా మారినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వరంగల్ లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారా...లేదా...? అనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.